నెల్లూరులో నేటి నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ

-

నెల్లూరులో నేటి నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరుగనుంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ఏటా నిర్వహించే రొట్టెల పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. 5 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి 12 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పండుగకు కేంద్రంగా ఉన్న బారాషహీద్ దర్గాను రకరకాల లైట్లతో అలంకరించారు. ఎన్నో ఏళ్ల నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతోంది. ఈ రొట్టెల పండుగ నెల్లూరు జిల్లా సంస్కృతిని అందరికీ చాటుతోంది. కాగా.. నెల్లూరులో జరిగే.. రొట్టెల పండుగకు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news