బ్రేకింగ్ : ఏపీ వ్యాప్తంగా టీకా మహోత్సవానికి బ్రేక్ ?

-

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా  టీకా మహోత్సవానికి బ్రేక్ పడింది. నిన్నటితో వ్యాక్సిన్ డోసులు ముగిసినట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన డోసులు సంఖ్య 40 లక్షల 44 వేల 600గా ఉంది.  అందులో కోవ్యాక్సిన్ 8 లక్షల 14 వేల 5 వందల 60 డోసులు కాగా, కోవిషీల్డ్ 4 లక్షల 40 వేల డోసులు వచ్చాయి. ఇక ఈ రోజు రాత్రి ఏపీకి కోవిషీల్డ్   4 లక్షల 30 వేల 40  డోసులు రానున్నట్టు చెబుతున్నారు.

ఇక కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించాలంటే టీకా ఒక్కటే సరైన మార్గమని, ప్రతి ఒక్కళ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రాలు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా మహోత్సవాన్ని నిర్వహించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మోదీ కోరారు.  సన్నద్ధమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news