బ్రేకింగ్; తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వెబ్ సైట్ హ్యాక్…!

-

భారత దేశంలో ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దీనికి సంబంధించి ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ లు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని స్పష్టంగా చెప్తుంది. ఎక్కడా కూడా ఈ విషయంలో తాము రాజీ పడేది లేదని, ఎవరికి తల వంచేది లేదని స్పష్టంగా చెప్తూ వస్తుంది.

హోం మంత్రి అమిత్ షా అయితే ఈ విషయంలో ధీమాగా ఉన్నారు. కొంత మంది అయితే భారతీయ ముస్లింలను చంపవద్దు అంటూ కోరుతున్నారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో ఒక పేరున్న గొప్ప వెబ్ సైట్ ని హ్యాక్ చేసారు కొందరు. స్టాప్ కిల్లింగ్ ఇండియన్ ముస్లిమ్స్ అంటూ పోస్ట్ చేసారు ఆ వెబ్ సైట్ లో. దీనిని ఒక ఫోటో రూపంలో పోస్ట్ చేసారు.

తెలుగులో తమకు తిరుగు లేదని భావిస్తున్న ఆ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి ఒక ఫోటో పోస్ట్ చేసారు. అందులో ప్రధాని నరేంద్ర మోడిని రాక్షసుడిగా చూపించారు. అలాగే ఒక ముస్లిం వ్యక్తి మృత దేహాన్ని కూడా చూపించారు దీనితో సదరు పేరున్న గొప్ప సైట్ ఇప్పుడు అప్రమత్తమైంది. అయితే అందులో పని చేసే ఉద్యోగులే దీనికి శ్రీకారం చుట్టారని అంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news