బ్రేకింగ్: పిఏసి చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులకు కరోనా…!

-

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలు , సన్నిహితులు, కార్యకర్తలు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పయ్యావుల సూచించారు. అనంతపురం జిల్లాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయితే నెల రోజుల నుంచి జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గాయి.

కాగా పయ్యావుల గత కొన్నాళ్ళుగా టీడీపీ లో సైలెంట్ గానే ఉంటున్నారు. ఆయన పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపించడం లేదు. ఏపీ సర్కార్ అప్పులు చేస్తున్నా సరే ఆయన మీడియాతో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా ఉండి కూడా మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news