BREAKING: ప్రపంచ కప్ ఫైనల్ కీ చేరిన పాకిస్తాన్

-

టి20 ప్రపంచ కప్ లో అనూహ్యంగా సెమీస్ వెళ్లే అవకాశం దక్కించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా ఫైనల్ కి దూసుకెళ్లింది. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. మరో 5 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ సొంతం చేసుకుంది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డేవన్ కాన్వే, కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతయుత ఇన్నింగ్స్ ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది. లక్ష్య చేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయాన్ని సాధించింది. మహమ్మద్ రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news