BREAKING : కోహ్లీ 50వ సెంచరీ పై సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ మెసేజ్ !

-

ఈ రోజు ముంబైలో జరుగుతున్న వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో ఇండియా భారీ స్కోర్ సాధించింది. ఇండియా ఇంత స్కోర్ ను సాధించడంలో కోహ్లీ 117, అయ్యర్ 105 మరియు గిల్ 79 లు చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ చాలా రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సొంత గ్రౌండ్ లో కోహ్లీ వన్ డే క్రికెట్ లో సెంచరీ లను పూర్తి చేసుకున్నాడు. ఈ రికార్డు గురించి సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సచిన్ తన ట్విట్టర్ లో “మొదటిసారి నేను నిన్ను ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో కలిశాను, అపుడు నా పాదాలను తాకినప్పుడు ఇతర టీం సభ్యులు అందరూ నవ్వుకున్నారు.

కానీ ఆ తర్వాత క్రికెట్ మీద నీకున్న ప్యాషన్ మరియు స్కిల్ కు నన్ను ఎంతగానో మెప్పించావు అంటూ ఎమోషనల్ మెసేజ్ ను సచిన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అందరూ కోహ్లీని మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news