సచిన్ రికార్డును దాటేసిన కింగ్ కోహ్లీ… 50 సెంచరీలతో రికార్డ్ !

-

ప్రపంచ క్రికెట్ లో ఇండియా కు చెందినా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన పేరిట ఎన్నో అమూల్యమైన రికార్డులను లిఖించుకున్నాడు. కానీ ఇప్పుడు ఇండియా కు చెందిన ఒక క్రికెటర్ మాత్రమే సచిన్ రికార్డులను ఒక్కొక్కటి బద్దలు కొడుతూ రన్ మెషిన్ గా పేరు తెచ్చుకుని ముందుకు వెళుతున్నాడు. విరాట్ కోహ్లీ ది కింగ్… ఈ వరల్డ్ కప్ లో ఎన్నో రికార్డులను ఇప్పటికే బద్దలు కొట్టాడు. అందులో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ సెంచరీ సాధించి సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీ ల రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సులతో 117 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ సెంచరీ తో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్ లలో కలిపి 80 సెంచరీ లు పూర్తి చేసుకున్నాడు.

ఇంకా కనీసం మూడు సంవత్సరాలు కోహ్లీ యాక్టీవ్ ప్లేయర్ గా ఉండే అవకాశం ఉండడంతో మరిన్ని సచిన్ రికార్డులు బద్దలు కొడతాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news