బ్రేకింగ్ : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం..!?

-

విశాఖ వాసులను వరుస ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి… ఓవైపు విజృంభిస్తున్న కరోనా వైరస్ తో పోరాటం చేస్తూనే మరోవైపు వరుస ప్రమాదాలతో కూడా బెంబేలెత్తి పోతున్నారు విశాఖ వాసులు. గత కొన్ని రోజుల నుంచి విశాఖలో భారీ అగ్నిప్రమాదాలు సంభవీస్తుండటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన.. ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది.

ఆ తర్వాత కూడా పలు అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా మరోసారి విశాఖలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖలోని శీలనగర్ కంటైనర్ యార్డ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. భారీ మొత్తంలో మంటలు చెలరేగాయి, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు . ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానిక ప్రజలు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హానికర రసాయనాలు ద్వారానే ఈ మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇలా వరుస ప్రమాదాలతో విశాఖ వాసులు దినదినగండంగా బతుకును వెళ్లదీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news