పోలా..అదిరిపోలా.. మద్యం మత్తులో వరుడు.. మరో యువకుడితో వధువు వివాహం..

-

కొందరు ఆనందంలో ఏం చేస్తారో.. ఎందుకు చేస్తారో కూడా తెలియకుండా చేసేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తనకు పెళ్లి అవుతుందనే ఆనందలో పీకలదాక తాగి పెళ్లి మండపానికి వచ్చాడు. దీంతో.. వధువు తరుపు బంధువులకు కోపం వచ్చే వేరే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఈ నెల 15న చోటు చేసుకుంది. వరుడు సునీల్ స్నేహితులతో తప్పతాగి మద్యం మత్తులో పెళ్లి మండపానికి ముహుర్తం టైం దాటిపోయాక వచ్చాడు. అతడిని చూసిన వధువు చీదరించుకుంది. అతడిని చేసుకోలేనని కరాఖండీగా తేల్చి చెప్పేసింది. దీంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

 

Nature of Hindu Marriage under the Hindu Law - iPleaders

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 15న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.15 గంటలకు పెళ్లి ముహూర్తం కావడంతో వరుడి కుటుంబ సభ్యులు ముందు రోజే గ్రామానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు బరాత్ మొదలైంది. బరాత్‌లో మిత్రులతో కలిసి తప్పతాగి చిందులేసిన వరుడు ముహూర్త సమయం దాటిపోయిన తర్వాత తీరిగ్గా మండపానికి చేరుకున్నాడు. మద్యం మత్తులో మండపానికి చేరుకున్న వరుడి వాలకం చూసిన వధువు, ఆమె కుటుంబ సభ్యులు చీదరించుకున్నారు.

అతడిని చేసుకోబోనని వధువు తెగేసి చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. మరోవైపు, వధువు కుటుంబ సభ్యులు అక్కడే బంధువుల తరపు అబ్బాయితో మాట్లాడి పెళ్లి ఖాయం చేశారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు ఇప్పుడే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తాడో అన్న భయంతోనే పెళ్లి రద్దు చేసుకున్నట్టు వధువు తరపు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. చివరికి పోలీసుల సమక్షంలో ఇరు కుటుంబాలు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news