నేడు నామినేషన్ వేయనున్న MLA కోటా BRS ఎమ్మెల్సీ అభ్యర్థులు

-

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్​ఎస్​ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్​ఎస్​ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏడాదితో శాసనమండలిలో గాంగాధర్​ గౌడ్​, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగుస్తుండడంతో..ఎమ్మెల్యే కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైంది.

నేటి నుంచి మార్చి 13 వరకు ఈ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ స్వీకరించిన నామినేషన్లను 14వ తేదీన పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఉపసంహరించుకున్న నామినేషన్ల తర్వాత వారం రోజుల సమయంలో మార్చి 23 న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్​ జరగనుంది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ నిర్వహించి.. అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news