కేసీఆర్ గొర్రెలు ఇస్తే.. రేవంత్ ఆ గొర్రెలకు గడ్డి ఇచ్చిండు : బీఆర్ఎస్

-

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో ఒక్క సారిగా రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో లో గొర్రెలు మేపే వ్యక్తి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ లతో పాటుగా చెప్పకుండా ఏడో గ్యారెంటీ ఇచ్చాడని అది ఇప్పుడే అమల్లోకి వచ్చిందని అదే గొర్రెలకి మేత అని అన్నారు.

వరి చేనులు మొత్తం ఎండిపోయి గొర్రెలకి గడ్డి దొరుకుతుందని ఇది ఇక మీదట కొనసాగుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ గొర్రెలు ఇస్తే రేవంత్ రెడ్డి వాటికి గడ్డి ఇచ్చాడని చెప్పుకొచ్చారు. వరి పంటకి నీళ్లు లేకుండా చేసి రేవంత్ రెడ్డి గొర్రెలకు గడ్డి ఇచ్చాడని అలాగే ఆనాటి రోజులు మళ్లీ తెస్తాను అని అన్నాడు తెచ్చి చూపించాడు అని రాసుకోచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో కెసిఆర్ గొర్రెలు ఇస్తే వరి పంటలకు నీళ్లు లేకుండా రేవంత్ రెడ్డి చేసే గడ్డి ఇచ్చారని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news