బీఆర్ఎస్ విధ్వంసం చేసే కుట్ర చేసింది : బండి సంజయ్ 

-

బీజేపీ ర్యాలీలో జోరబడి  విధ్వంసం చేసే కుట్ర బీఆర్ఎస్ చేసిందని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని.. ఇప్పుడు బీజేపీ గ్రూపు 1 అభ్యర్థులకు మద్దతు తెలిపుతుంటే బీఆర్ఎస్  కావాలని విధ్వంసం చేసింది. ఇది మంచి పద్దతి కాదన్నారు. నేను పేపర్ లీకేజీ చేసినని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. నీది ఓ మనిషి పుట్టుకా..? నువ్వు.. మీ అయ్య వచ్చి ఏ టెంపుల్ కి వచ్చి ప్రమాణం చేస్తారో చేయండి.. మీకు సెల్యూట్ కొడుతా అన్నారు బండి సంజయ్. 

బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని ప్రమాణం చేస్తారా..? కేటీఆర్ పిచ్చి వాగుడు వాగుతున్నాడు. కేటీఆర్-రేవంత్ రెడ్డి ఒకటి అన్నారు బండి సంజయ్. నువ్వు రేవంత్ రెడ్డి ఒక్కటి కాకుంటే.. ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అని ప్రశ్నించారు. కేటీఆర్ చీకటి బ్రతుకు నాకు తెలియదా..? ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి గ్రూపు-1 అభ్యర్థుల సమస్యలను వినాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి గ్రూపు-1 పరీక్షను రద్దు చేయాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. రీ షెడ్యూల్ చేయమని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం గ్రూపు–1 అభ్యర్థుల విషయంలో ఎందుకు మొండి వైఖరీ వహిస్తుందో అర్థం కావడం లేదు అన్నారు బండి సంజయ్. కేటీఆర్ డ్రగ్స్ కేసు ఏమైంది అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news