గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కి బీఆర్ఎస్ వినూత్న ప్రచారం

-

వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కేవలం  నాలుగు రోజుల్లోనే పోలింగ్ ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గెలుపుకోసం ఫ్లాష్ మాబ్ డ్యాన్సులతో బీఆర్ఎస్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంటోంది.

వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లలో యువతీ యువకులు ఫ్లాష్ మాబ్ డాన్స్ లకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కొత్త తరహా ప్రచారం స్థానికులను ఆకట్టుకుంటోంది. అలాగే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం ఈ తరహా ఫ్లాష్ మాబ్ ప్రచారం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news