దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉంది: జూపల్లి కృష్ణారావు

-

ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.లిక్కర్ సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ ను పటిష్టంగా నివారిస్తున్నామని ఆయన అన్నారు.మద్యం కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తప్ప ప్రజలకు కాదని,దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులను పెండింగ్ లో పెట్టిందని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో కొత్త మద్యం బాండ్లు తీసుకొస్తామనేది అబద్ధమని , కొత్త బాండ్ల పై అసలు పరిశీలనే జరగలేదన్నారు. గత ప్రభుత్వం చాలా బిల్లులను పెండింగ్ లోపెట్టిందని తెలిపారు. రైతు భరోసాకు రూ. 6 వేల కోట్లకు పైగా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని చెప్పారు. టానిక్‌లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news