జనవరి 3 నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాలు

-

జనవరి 3 నుండి బీఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీ సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు జరగనున్నాయి

🔹జనవరి 3 – ఆదిలాబాద్
🔹జనవరి 4- కరీంనగర్
🔹జనవరి 5 – చేవెళ్ల
🔹జనవరి 6 – పెద్దపల్లి
🔹జనవరి 7 – నిజామాబాద్
🔹జనవరి 8 – జహీరాబాద్
🔹జనవరి 9 – ఖమ్మం
🔹జనవరి 10 – వరంగల్
🔹జనవరి 11 – మహబూబాబాద్
🔹జనవరి 12 – భువనగిరి
🔹జనవరి 16 – నల్గొండ
🔹జనవరి 17 – నాగర్ కర్నూల్
🔹జనవరి 18 – మహబూబ్ నగర్
🔹జనవరి 19 – మెదక్
🔹జనవరి 20 – మల్కాజ్‌గిరి
🔹జనవరి 21 – సికింద్రాబాద్ మరియు హైదరాబాద్

పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news