బీఆర్ఎస్ త్వరలోనే ఖాళీ అవుతుంది : బీజేపీ నేత

-

ఉమ్మడి ఏపీలోనూ బీజేపీకి ఏనాడు 8 ఎంపీ సీట్లు రాలేదని ఎంపీ లక్ష్మణ్. అన్నారు.రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి 35శాతం ఓట్లు సాధించామని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు.మెదక్, కరీంనగర్ లోనూ బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లక్ష్మణ్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రులు చెబుతున్నారని.. ఆ పార్టీ త్వరలోనే ఖాళీ అవుతుందని తెలిపారు.రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు బీజేపీని గెలిపించారని లక్ష్మణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news