బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం..ఎన్నికల్లో బీజేపీతో పొత్తు సిద్దం!

-

బీహర్‌లో ఎన్నికలు రసవత్తంగా జరుగుతున్నాయి..అధికార విపక్షాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి..మరో వైపు యూపీ రాజ్యసభ ఎన్నికల సమయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకుంది..ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతామని..ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి బుద్ధి చెప్పడానికి తమ పూర్తి శక్తిని వినియోగిస్తామని ప్రకటించారు..అవసరమైతే బీజేపీకి ఓటు వేయడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని మాయవతి సంచలన ప్రకటన చేశారు.

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిబంధనలకు వ్యతిరేఖంగా వ్యవహరించిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు మాయావతి గురువారం ప్రకటించారు..వచ్చే ఎన్నికల్లో  బీజేపీకి కూడా ఓటు వేయడానికి సిద్ధంగానే ఉంటాం. లేదంటే మరో పార్టీకి. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం అన్నారు మాయావతి..ఎస్పీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఇలా చేతులు కలిపిన మొదటి రోజు నుంచే 1995 లో సమాజ్‌వాదీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని నేతలు తమపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని ఆమె వెల్లడించారు. ఆ కేసును వెనక్కి తీసుకొని తాము పెద్ద తప్పే చేశామని మాయావతి వ్యాఖ్యానించారు. కాగా, 2019లో భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఇంతటి ఎదురుదెబ్బను బీఎస్‌పీ చవిచూడటం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news