అది తలుచుకుంటే జగన్ కు చంచల్ గూడ జైలే గుర్తొస్తుంది..?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఎప్పటికప్పుడు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండి పడుతూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇక ఇటీవలే మరో సారి విజయ్ సాయి రెడ్డి పై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అంటూ మాయమాటలు చెప్పారని… కానీ ఇప్పుడు ఇచ్చిన మాటను తప్పి కేంద్రం మెడలు వంచటం కాదు కేంద్రం ముందే మెడలు వంచుతున్నారు అంటూ ఎద్దేవా చేస్తారు బుద్ధ వెంకన్న.

ఇక ప్రత్యేక హోదా గురించి తలుచుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏకంగా చంచల్ గూడా జైలు గుర్తొస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్ధ వెంకన్న. ఇచ్చిన మాట నిలబెట్టుకో కుండా ప్రతి విషయంలో జగన్ తీసుకుంటున్న యూ టర్నులు చూసి ఏకంగా రంగులు మార్చే ఊసరవెల్లులు సైతం భయ పడి ఆత్మహత్య చేసుకుంటున్నాయి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతుంది అంటూ తెలిపిన బుద్ధ వెంకన్న ఎన్నికల్లో వైసీపీ ని పాతాళానికి పాతెయ్యటానికి ప్రజలందరూ సిద్ధమయ్యారు అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news