బెజవాడ టీడీపీలో ముసలం… కేశినేనిని చెప్పుతో కొట్టాలి !

-

విజయవాడ టీడీపీలో ముసలం ఏర్పడింది. కేశినేని నాని కుమార్తె కేసినేని శ్వేతకు విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ప్రకటించడంతో నాని వ్యతిరేక వర్గం ఏకం అయింది. ఈరోజు సమావేశం అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని ఉంటే ఎన్నికల్లో పని చేయలేమని ప్రకటించిన నేతలు అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ను ఏకవచనం తో మాట్లాడిన నాని ని ఆ రోజే చెప్పుతో కొట్టాలి అనుకుంన్నానని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

రంగా ను చంపిన కేసులో ముద్దాయిలను వెంట పెట్టుకుని నాని తిరుగుతున్నాడని రంగాను చంపిన కేసులో ముద్దాయిలను వేసుకుని ప్రచారానికి తిరుగుతారా ? అని ఆయన ప్రశ్నించారు. నానివి కులం పోకడలు..పార్టీ కి నష్టం అని ఆయన అన్నారు. మేము సాయి రెడ్డి తో ఫైట్ చేస్తుంటే….కేశినేని సాయి రెడ్డి ని లంచ్ కి పిలుస్తాడా ? నేను ఇకపై విజయవాడ పార్లిమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఉంటా!? 2024 లో నేనే ఎంపీ గా పోటీ చేస్తా! నని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అంతేకాక కేశినేని నాని రెండు కాళ్ళు ఇరగ్గొడతా!? నా వెనుక ఉన్న ఒక్క మనిషిని పంపితే చాలు….నాని పని అయిపోతోందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news