కేంద్రమంత్రులతో సమావేశమైన ఏపి మంత్రి బుగ్గన..!

-

ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఆర్థిక చేయూతను ఇవ్వాలని మంత్రి బుగ్గన ఆమెను కోరారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలపై చర్చించారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సైతం మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్‌ కలిశారు.

పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, పీడీఎస్, జీఎస్టీ బకాయిల మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బుగ్గన ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కూడా భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3500 కోట్లు పెండింగ్ నిధులను విడుదల చేయాలని బుగ్గన..షేకావత్ ను కోరారు. రాష్ట్రానికి పెట్టిన ఖర్చు ఎప్పటికప్పుడు తిరిగి వచ్చేందుకు, ఇతర నీటికి సంబంధించిన అంశాలను కూడా చర్చించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news