కరోనా ఎఫెక్ట్: కడప-బెంగుళూర్ మధ్య బస్సు సర్వీసులు నిలిపివేత.!

-

కరోనా కారణంగా ఆదివారం రోజున కడప-బెంగుళూర్ మధ్య నడిచే బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు స‌ర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డ‌బ్బులు తిరిగి చెల్లిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి ఆదివారం బెంగుళూర్ లో పూర్తి లాక్‌డౌన్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్ల‌డించారు.

కాగా మిగతా రోజుల్లో స‌ద‌రు రూటులో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బస్టాండ్లలోని అన్ని స్టాళ్లలో మాస్కులు అందుబాటులో ఉంచామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news