పిఠాపురంలో గ్రౌండ్ రియాలిటీ పవన్ కు ఏమీ తెలీదు: బైరెడ్డి సిద్దార్ధరెడ్డి

-

పొలిటికల్ వేక్యూమ్ లేకపోవడం వల్ల నాకు సీటు దక్కలేదు. పార్టీని కాదని డబ్బు సంచులు తెచ్చారని టిడిపి వారిని ఆశీర్వదిస్తారని నేను అనుకోను అని అన్నారు. చంద్రబాబు దగ్గర దేనిపైనా సమాధానం లేదు. పిఠాపురంలో గ్రౌండ్ రియాలిటీ పవన్ కి ఏమీ తెలీదు. ఒకరిపై ఆధారపడి పవన్ ఎలక్షన్ చేయాల్సిందే. పులివెందులలో మోదీ, ట్రంపు, బైడెన్ నుంచున్నా కూడా గెలిచేది జగన్ అని అన్నారు.

మంగళగిరి డెవలప్మెంట్ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు అని బైరెడ్డి సిద్దార్ధరెడ్డి అన్నారు. మేం ఎక్కడ గెలుస్తామే కచ్చితంగా చెప్పగలం వాళ్ళెందుకు చెప్పలేకపోతున్నారు అని అన్నారు. మేం సాలిడ్ గా పోటీ లేకుండా గెలుస్తామని 5,6 జిల్లాలు చెప్పుకోగలం అని అన్నారు. కుటుంబాల మధ్య గొడవ పెట్టడానికే కానీ మరే కారణంగానూ వివేకా హత్య హైలైట్ చేస్తున్నారు అని అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వివేకా అంశం తేవడం చంద్రబాబు కి మేలు చేయాలనే ప్రయత్నమే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news