మేడారం హుండీ లెక్కింపు…. తొలిరోజు ఆదాయం ఎంతంటే ?

-

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతర హుండీ లెక్కింపు గురువారం నాడు ప్రారంభమైంది.ఇక హుండీ ఆదాయం తొలిరోజు లెక్కించగ రూ.3.15 కోట్లుగా ఉంది.మొత్తం 518 హుండీలను 10 రోజుల పాటు లెక్కించనున్నారు.

నేడు మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించగా 3 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేయనున్నారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం సీసీ కెమెరాలతో పాటు పటిష్ట భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news