కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ స్కీములన్నీ…. స్కాములుగా మారుతాయి : ఖుష్బూ

-

కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ.కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ స్కీములన్నీ.. స్కాములుగా మారుతాయని ఖుష్బూ విమర్శలు చేశారు. మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో గురువారం బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా ఆమె మాట్లాడుతూ…. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ప్రగతి పథాన దూసుకుపోతోందని ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు వాళ్ల పథకాల్లోనూ ప్రతిబింబిస్తాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అధికారంలో ఉంటే కేవలం వాళ్ల కుటుంబాలు మాత్రమే బాగుపడాతాయని సంచన్న ఆరోపణలు చేశారు . బీఆర్ఎస్ పాలనను తలపించేలా కాంగ్రెస్ కూడా పాలన కొనసాగిస్తోందని ఆమె మండిపడ్డారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ యాత్ర అనంతరం నగరంలో స్థిరపడిన తమిళ ప్రజలతో ఖుష్బూ సమావేశం నిర్వహించి,బీజేపీకి మద్దతు తెలపాలని వారిని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news