నిరుద్యోగులకు బిగ్ షాక్..TSPSC నిర్వహించిన 4 పరీక్షలు రద్దు

-

నిరుద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది TSPSC. ఇప్పటి వరకు TSPSC నిర్వహించిన 4 పరీక్షలు రద్దు చేసింది. ఈ నెల 5న 837 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ లకు జరిగిన పరీక్షకు 55 వేల మంది హాజరు అయ్యారు. ఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ.

అక్టోబర్ 16 న జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు 2 లక్షల 86 వేల మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. ఫలితాలు ప్రకటన చేయగా… 1: 50 నిష్పత్తి లో 503 పోస్ట్ లకు 25 వేల 50 మంది ఎంపిక అయింది. ఫిబ్రవరి 26 న జరిగిన డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పరీక్ష 53 పోస్ట్ లకు 67 వేల మంది హాజరు అయ్యారు. జనవరి 22 న జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష 1540 పోస్ట్ లకు 61 వేల మంది హాజరు అయ్యారు. ఈ పరీక్షలను TSPSC రద్దు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news