సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

-

కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో పాల్గొన్న ఆందోళనకారులు అంతా తమపై ఎప్పుడు ఏ కేసులు బనాయిస్తారో అని భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ కి చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్లలో ఒక టీవీ చానెల్ లో అజయ్ మాట్లాడాడు. తన మీద పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి అజయ్ ని చికిత్స నిమిత్తం తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news