కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా..తప్పిన పెను ప్రమాదం..!

-

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..కారు టైర్‌ పేలడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది..మాదాపూర్ నుంచి బంజారాహీల్స్ వెలుతుడంగా ఈ ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు స్థానికులు..కారు ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు..రోడ్డుపై కారు అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది..ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు..తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఇటివలే రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు..తెలంగాణకు మణిహరంగా అభివర్ణించిన ప్రభుత్వం..ఇప్పుడు బ్రిడ్జిపై కారు ప్రమాదం జరగటంతో అధికారులు అలర్ట్ అయ్యారు..కేబుల్ బ్రిడ్జిపై మొదటి నుంచి పోలీసు భద్రత లేకపోవడంతో..యువత,నగరవాసులు బ్రిడ్జిపై ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు..తాజా ప్రమాదంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి..బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత ఇది మొదటి ప్రమాదం..

Read more RELATED
Recommended to you

Latest news