FLASH : నటి మాధవీలతపై కేసు నమోదు.. కారణం అదేనట..!

-

ప్రముఖ హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. వివిధ అంశాలపై స్పందించే మాధవీలత.. తాజాగా.. తన ఫేస్‌బుక్‌లో ఒక కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఆ కామెంటే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. మాధవీలత పెట్టిన కామెంట్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై స్పందించిన. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెపై 295-A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే మాధవీలత ప్రస్తుతం జీఎస్‌ఎస్ఎస్‌పి కళ్యాణ్ డైరెక్షన్‌లో లేడీ అనే సినిమా చేస్తుంది. నిజ ఘ‌ట‌నల‌ ఆధారంగా రూపొందుతున్న ఈ ఎమోష‌న‌ల్ డ్రామాను చరణ్స్ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version