కంచే చేను మేస్తే.. రిటైర్డ్ ఎస్సై ఘరానా మోసం…!

-

 రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సాన అనిల్ కుమార్, కూన బోయిన చంద్రశేఖర్ అనే ఇద్దరు యువకులు వాపోయారు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని దీంతో హెచ్ ఆర్సీని ఆశ్రయించామని బాధితులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే… 2016 లో జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ఎస్సై గుర్రం రాజమౌళి పరిచయం అయ్యాడు. తనకు రైల్వే శాఖలో తెలిసిన వారు ఉన్నారని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వీరికి నమ్మబలికాడు. ఒక్కొక్కరి దగ్గర 13 లక్షలు వసూలు చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడు. ఇప్పటి వరకు వారికి ఉద్యోగం రాక ఇటు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు. గుర్రం రాజమౌళిని బాధితులు తాము ఇచ్చిన డబ్బులు తిరిగి  ఇవ్వాలని కోరగా తాను ఎస్సై నని ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు గురి చేశారని మీడియా ముందు వాపోయారు.  

Read more RELATED
Recommended to you

Latest news