శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉందని హెచ్ఆర్సి ని ఆశ్రయించిన సొంత పార్టీ కౌన్సిలర్…!

-

మంత్రితో ప్రాణహాని ఉందని సొంత పార్టీ కౌన్సిలరే హెచ్ ఆర్ సీ ని ఆశ్రయించాడు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి తనకు ప్రాణహాని ఉందని మహబూబ్ నగర్ మునిసిపాలిటీ 43 వ వార్డు కౌన్సిలర్ బురుజు సుధాకర్ రెడ్డి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే సుధాకర్ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కావడం గమనార్హం.

సుధాకర్ మరి కొందరు పార్టీ నేతల తో పాటు వన్ టౌన్ సీఐ రామేశ్వర్ గౌడ్ నుండి కూడా తనకు ప్రాణ హాని ఉందని ఈ ఫిర్యాదును అందజేశారు. వారి నుండి తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాకుండా తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ ఘటన జిల్లా టీఆర్ఎస్ లో కలకలం రేపింది. సొంత పార్టీ నేత మంత్రి పై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news