భూపాల‌ప‌ల్లిలో దారుణం.. రోడ్డు ప్ర‌మాదంలో రెండేళ్ల కుమారుడు, తండ్రి మృతి

-

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లిలో దారుణం చోటు చేసుకుంది. అత్త‌రింటికి వెళ్తున్న కుటుంబం రోడ్డు ప్ర‌మాదానికి గురి అయింది. ఈ ప్ర‌మాదంలో తండ్రి తో పాటు రెండేళ్ల కుమారుడు కూడా మృతి చెందాడు. ఈ దారుణ ఘ‌ట‌న భూపాలప‌ల్లి జిల్లాలోని చిట్యాల మండ‌లం నైన్ పాక గ్రామం వద్ద చోటు చేసుకుంది. అయితే వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా శ‌యంపేట్ కు చెందిన మ‌రపెళ్లి న‌వీన్ (30) త‌న భార్య మేఘ‌న తో పాటు కొడుకు బాబు (2) తో బైక్ పై అత్త‌గారి ఇంటికి వెళ్తున్నాడు.

మార్గ మ‌ధ్యలోనే ఉన్న స‌మ‌యంలో నైన్ పాక గ్రామ శివారులో న‌వీన్ బైక్ ను ఒక ట్రాక్ట‌ర్ ఢీ కొట్టింది. దీంతో న‌వీన్ తో పాటు రెండేళ్ల కొడుకు బాబు అక్కడికక్క‌డే మృతి చెందారు. భార్య మేఘ‌న కు తీవ్ర గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు స్థానికులు తీవ్ర గాయాల‌పాలు అయిన మేఘ‌న‌ను చిట్యాల‌ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే మేఘ‌న ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయితే ఈ ప్ర‌మాదం పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news