టాలీవుడ్ “విలన్” పై ముంబై లో కేసు నమోదు

-

టాలీవుడ్ విలన్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ పై ముంబైలో కేసు నమోదు అయింది. ఆయన తెరకెక్కించిన ఓ సినిమాలో పిల్లలపై అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటం కారణంగా… దర్శకుడు మహేష్ మంజ్రేకర్ పై కేసు నమోదు అయింది. ఇటీవల మహేష్ మంజ్రేకర్…”నై వరుణ్ బట్ లోంచా కౌన్ నహి కొంచా” అనే ఓ మరాఠీ సినిమాను తీశారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎక్కువగా పిల్లల పైనే చిత్రీకరించారు దర్శకులు. ముఖ్యంగా వారి పై జరిగే ఆకృత్యాలు అలాగే వాళ్లను బానిసలుగా చూపే అంశాలపై ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాలో సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీం దేశ్పాండే… మహేష్ మంజ్రేకర్ పై కేసు పెట్టారు.

సినిమాలో నటించిన పిల్లలంతా మైనర్లనీ… వారిపై అలాంటి దృశ్యాలు షూటింగ్ చేయడం ఫోక్స్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై ముంబై కోర్టులో తాజాగా మహేష్ ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారించిన కోర్టు.. ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news