మలక్‌పేటలో బాలింతల మృతి కేసులో కీలక మలుపు

-

హైదరాబాద్​ మలక్​పేటలో ప్రసవం కోసం వచ్చిన ఇద్దరు మహిళలు డెలివరీ తర్వాత ఆరోగ్యం క్షీణించి మరణించిన సంగతి తెలిసిందే. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వారు మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించగా ఉన్నత వైద్య శాఖ ఈ ఘటనపై విచారణ కమిటీ నియమించింది. ఈ క్రమంలో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగానే మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఇద్దరు బాలింతలు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించినట్లు సమాచారం.

ఈ ఇద్దరితోపాటు అంతకుముందు సిజేరియన్‌ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్‌ అత్యవసర విభాగానికి అప్పటికప్పుడు తరలించారు. ఇందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో రెండు రోజులుగా డయాలసిస్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం కాస్త ఆందోళకరంగా ఉందని, కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మరో 9 మందిని సోమవారం డిశ్చార్జి చేయగా..ఇంకా ఏడుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news