VeeraSimhaReddy : ఇవాళ వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవం

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తాజాగా బాలకృష్ణ తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించి మెప్పించింది. ఇందులో కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటించగా.. ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్గా నిలిచాయి.

దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కొన్నిచోట్ల నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ కూడా కలెక్షన్లు మోత మోగించింది ఈ సినిమా. ఈ మూవీ విజయం సాధించడంతో.. ఇవాళ వియోత్సవ సభను నిర్వహిస్తోంది చిత్ర బృందం. ఈ వీరసింహుని విజయోత్సవం జేఆర్సీ కన్వేషన్ లో జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news