సినీ ప్రేమికులకి కేంద్రం శుభవార్త

-

సినీ ప్రేమికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫిబ్రవరి నెల నుంచి సినిమా హాలు, సినిమా థియేటర్లలో మరిన్ని సీట్ల బుకింగ్ కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల గైడ్ లైన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఫాలో కావాల్సిన గైడ్ లైన్స్ ని కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ప్రస్తుతం 50 శాతం ఉన్న బుకింగ్స్ ని మరింత పెంచనుంది. అయితే ఎంత మేరకు పెంచారు అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ విషయం మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇక దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్ కూడా తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గైడ్ లైన్స్ లో అనుమతి ఇచ్చింది. ఇక తాజాగా గైడ్ లైన్స్ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news