విశాఖ స్టీల్ ప్లాంట్‍పై కేంద్రం కీలక ప్రకటన…ప్రైవేటీకరణ తప్పదు !

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మల సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జనవరి 27వ తేదీన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు.

ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారు.  ప్రస్తుత ఉద్యోగులు,  భాగస్వాముల కు సంబంధించిన అంశాలను ఒప్పందంలో పరిష్కరిస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్‍లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవని, ఈ ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని అన్నారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news