చంద్రబాబు, లోకేష్ భద్రతపై నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షములో ఉన్న టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై ఈ మధ్యనే దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిపై పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర హోమ్ శాఖ కు ఒక ఫిర్యాదును చేయడం జరిగింది. ఏపీలో భద్రత నిండా కరువయింది, ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కనకమేడల ఫిర్యాదులో మెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై కేంద్ర హోమ్ శాఖ ఏపీ సీఎస్ మరియు డీజీపీ లనుండి రిపోర్ట్ ను కోరుతూ వారికి లేఖను రాయడం జరిగింది. మరి ఈ విషయంపై సీఎస్ మరియు డీజీపీ లు ఏ విధమైన సమాధానాన్ని ఇస్తారు అన్నది చూడాలి. కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా వైసీపీని ఓడించి పాలనలోకి రావాలన్న కసితో ఒకవైపు లోకేష్ మరోవైపు చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ఇక్కడ జగన్ పాలనకు మరియు జగన్ వినూతనమైన ఆలోచనలకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news