హింస చెలరేగిన మణిపూర్ కు మూడు రోజుల అమిత్ షా పర్యటన…

-

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక బిల్లు కారణంగా మణిపూర్ రాష్ట్రము అంతటా హింసాత్మక పరిస్థితులతో దాదాపుగా నెల రోజుల నుండి అట్టుడుకుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అన్నీ మెల్ల మెల్లగా సర్దుమణుగుతున్నాయి. రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా వెళ్లిపోయారు. అంతా అయిపోయాక ఇపుడు కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షా మణిపూర్ పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం మణిపూర్ లో మూడు రోజుల పాటు అంటే 29 మే నుండి 1 జూన్ వరకు ఉండనున్నారు. మణిపూర్ లో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని సమీక్షించడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధికారికంగా తెలియచేశారు.

ఇక మణిపూర్ వచ్చిన అనంతరం ఒక బహిరంగ మీటింగ్ ఏమైనా పెడతారా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక ఘటనల ఫలితంగా నిత్యావసర సరుకులకు రెక్కలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news