ఉద్యోగులకు మోడీ సర్కార్ బోనస్ ప్రకటన.. 11 లక్షల మందికి లబ్ది

-

రైల్వే ఉద్యోగులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. నాని గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ఏకంగా 78 రోజులకు జీతాన్ని ఈ ఏడాది బోనస్ గా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఖజానాపై ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల మేర భారం పడనున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ మరియు గోయల్ మీడియాకు కేబినెట్ నిర్ణయాలను తెలిపారు. దేశ వ్యాప్తంగా ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ట్ టైల్ రీజనింగ్ అండ్ అపెరల్ పార్కు ఏర్పాటుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో రూ. 4445 కోట్లతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.

Read more RELATED
Recommended to you

Latest news