ఇక పై క్రికెట్ కి కరోనాతో సహజీవనం తప్పదు: సీఈఓ వసీమ్ ఖాన్

-

ఇక నుంచి క్రికెట్​, కొవిడ్​ సహజీవనం చేయాల్సి ఉంటుందని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సీఈఓ వసీమ్​ ఖాన్​ అన్నారు. క్రీడల పునఃప్రారంభానికి ముందే ఆటగాళ్లలో కరోనా కేసులు ఉన్నప్పటికీ.. పీసీబీ ఇంగ్లాడ్​ పర్యటనను ముందుగానే ఆటగాళ్లను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఖాన్​ తెలిపారు. తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు పంచుకున్నారు​.

ceo vasim
ceo vasim

ఈ మహమ్మారి మధ్య అంతర్జాతీయ క్రికెట్​ తిరిగి ప్రారంభమయ్యేలా చూడటం మినహా.. ఇంగ్లాండ్​ పర్యటన వెనక వేరే కారణం లేదని ఖాన్​ ఉద్ఘాటించారు.గత నెలలో 10 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం తమ జట్టును పంపాలా వద్దా అనే సందిగ్ధతలో పడింది పీసీబీ. ఇటీవలే రెండో రౌండ్​లో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్​గా తేలిన కొంత మంది ఆటగాళ్లు ఇంగ్లాండ్​ చేరారు.మరోవైపు, ఆగస్టు 5 నుంచి ఇంగ్లాడ్​ జట్టుతో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ ఆడనుంది పాక్​. అనంతరం ఇరు జట్ల మధ్య టీ 20 మ్యాచ్​లూ జరగనున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news