ఆగస్టులో తెలంగాణ సెట్ పరీక్షలు..!

-

హైదరాబాద్: తెలంగాణలో సెట్‌ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌కి ప్రతిపాదనలు పంపింది. ఉన్నత విద్యామండలి ప్రాదనలను అందుకున్న మంత్రి కార్యాలయం పరిశీలించి సీఎంవో కార్యాలయానికి పంపింది. ఇవాళో రేపో సెట్స్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి తేదీలు ప్రకటించనుంది.

ఆగస్ట్ 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్, ఆగస్ట్ 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్&మెడికల్, ఆగస్ట్ 3న ఈసెట్, ఆగస్ట్ 11నుంచి 14వరకు పీజీసెట్, ఆగస్ట్ 19,20తేదీల్లో ఐ సెట్, ఆగస్ట్ 23 న లాసెట్, ఆగస్ట్ 24,34 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇక పీఈ‌సెట్ నిర్వహణ‌పై జూలై 16 తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

కాగా కరోనా కారణంగా సెట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడింది. ఇప్పటికే  పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఫీజులు కూడా చెల్లించారు. దీంతో పరీక్షల నిర్వహణపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉన్నతమండలి ప్రతిపాదనలతో ఊపిరి పీల్చుకోనున్నారు. పరీక్షల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news