బెజవాడలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి బంగారం లాక్కెళ్లిన దుండగులు..!

-

విజయవాడ లో దారుణం చోటుచేసుకుంది. వృద్ధురాలి పై దాడి చేసి దుండగులు బంగారం లాక్కెళ్లారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన విజయవాడ శివారు ప్రాంతం కుందా వారి కండ్రిక లో చోటు చేసుకుంది. ఇంటి ముందు కూర్చొని ఉన్న వృద్ధురాలు సుబ్బమ్మ పై దుండగులు దాడి చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. స్థానికులు గమనించి సుబ్బమ్మ ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

crime
crime

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బమ్మ మృతి చెందింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు కూర్చున్న వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి బంగారం లక్కెళ్ళడం తో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంటి ముందే రక్షణ లేకపోతే ఇంకా బయట ఎలా తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు ఎవరా అన్న దానిపై విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news