హైదరాబాద్‌లో దిల్లీ దొంగలు.. ఒకేరోజు ఆరోచోట్ల చైన్ స్నాచింగ్

-

హైదరాబాద్ నగరంలో ఇవాళ గొలుసు దొంగల ముఠా రెచ్చిపోయింది. రెండు గంటల వ్యవధిలో ఆరు చోట్ల మహిళల మెడల్లోంచి దొంగలు బంగారు గొలుసులు తెంచుకుపోయారు. ఈ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి మొదలుకొని ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉప్పల్‌, కల్యాణపురి, నాచారం నాగేంద్రనగర్‌, ఓయూలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రామ్‌గోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లోని దుండగులు మహిళల మెడల్లోంచి గొలుసులు దొంగిలించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

దిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠా గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు రైల్వేస్టేషన్లు వద్ద నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలు చేపట్టారు. దొంగల ముఠా రైలులో దిల్లీ పారిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితుల గురించి సమాచారం అందించాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news