చలో ఢిల్లీ మార్చ్ పై కీలక ప్రకటన..!

-

దేశ రాజధాని ఢిల్లీ శివారు లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాల ప్రతినిధులతో చండీగర్ లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా పియూష్ గోయల్ నిత్యానంద రాయ్ ఈరోజు భేటీ అయ్యారు. పప్పు ధాన్యాలు మొక్కజొన్న పత్తి పంటలను ఐదేళ్లు పాటు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని రైతులకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఈ నేపథ్యం లో రైతులు తలపెట్టిన చలో ఢిల్లీ మార్చ్ ని రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news