పది రూపాయిలు ఇచ్చి వంద దోచిన గజదొంగ జగన్: చంద్రబాబు

-

ప్రజలకి రూ.10 ఇచ్చి 100 రూపాయల దోచిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగుల ఏర్పాటు చేసిన సభకి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సభ లో ఆయన మాట్లాడుతూ కదలిరా అని పిలిస్తే ఉధృతంగా కదలి వచ్చారని అన్నారు. ఈ సభలో ఉన్న జనాన్ని చూస్తుంటే టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చినట్లే కనపడుతుందని అన్నారు.

ఈ మాడుగుల సభ చూస్తే తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుందని ఇక మీదట బయటకి కూడా వెళ్ళదని చెప్పారు. ఎన్నికలకు ఇంకా 64 రోజులే ఉందని తర్వాత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందని వైసీపీ ఇంటికి వెళ్ళిపోతుందని అన్నారు చంద్రబాబు. ఈ ఎన్నికలు రాజకీయాల కోసం కాదని రాష్ట్ర ప్రజల కోసం అని అన్నారు ప్రజల బంగారు భవిష్యత్తు కోసమేనని చెప్పారు సైకో పాలన అంతం చేస్తే తప ప్రజలకు భవిష్యత్తు ఉండదని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news