కోవిడ్ తో నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలంటూ చంద్రబాబు దీక్ష.. నేడే.

-

కోవిడ్ 19 సెకమ్డ్ వేవ్ తీవ్రంగా నష్టపర్చింది. తమ ప్రియమైన కోల్పోవడం సహా ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేసింది. కోవిడ్ కారణంగా బ్రతుకులన్నీ ఆగమ్యగోచరంగా మారాయి. ఐతే ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈ రోజు ఉదయం 10గంటల నుండి 1గంట వరకు నిరసన కార్యక్రమం జరగనుంది.

ఇందులో భాగంగా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25లక్షలు, కోవిడ్ మృతులకు 10లక్షలు, జీవనోపాధి కోల్పోయిన చిన్న చిన్న వ్యాపారులకు తెల్లరేషన్ కార్డు ఉంటే 10వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు సహా కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. మరి ఈ నిరసన కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news