జగన్‌ కు ఎక్స్‌ పైర్‌ డేట్ దగ్గర పడింది, మరో 5 నెలలు మాత్రమే – చంద్రబాబు

-

జగన్‌ కు ఎక్స్‌ పైర్‌ డేట్ దగ్గర పడింది, మరో 5 నెలలు మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. నూజివీడు పట్టణంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఏపీ పరిస్థితి ఉందని ఫైర్‌ అయ్యారు. ఆ శని జగన్మోహన్ రెడ్డే, ఎంత త్వరగా వదిలించుకుంటే రాష్ట్రం అంత బాగుపడుతుందని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి సైకోలను తరిమికొడితే తప్ప భవిష్యత్తు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకే కోడికత్తి డ్రామా ఆడినట్లు నిందితుడు శ్రీనివాస్ చెప్పాడని.. అవకాశం దొరికితే శ్రీనివాస్ ని కూడా చంపేసి నేనే చంపానని మరో జగన్నాటకానికి తెరలేపేవాడని నిప్పులు చెరిగారు. సైకో వల్ల ఏపీలో తప్ప ప్రపంచ మంతా తెలుగువారు బాగున్నారని.. ప్రజల రక్తాన్ని తాగే దుర్మార్గుడు జగన్ అని ఆగ్రహించారు. రాష్ట్రాన్ని దొంగల ముఠా దోపిడీ చేస్తోందని.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఇందుకు క్విట్ జగన్ అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news