చెత్త పైనా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది : చంద్రబాబు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు. అయితే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబుకు రాజమండ్రి విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం భారీ వాహన శ్రేణితో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి జగ్గంపేట రోడ్ కు తరలివెళ్లారు. అక్కడ తనకు స్వాగతం పలికిన మహిళలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మహిళల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీడీపీ. మహిళలకు ఆస్తి హక్కు, విద్యారంగంలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్.

డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిన పార్టీ టీడీపీ. నేడు మహిళలు పురుషులకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అదీ మహిళా శక్తి. వైసీపీ ప్రభుత్వం పన్నులు బాదుడుతో ప్రజలను బాదేస్తుంది. రాష్ట్ర ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. చివరికి చెత్త పైనా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి మీ నుంచి రూ.50 కాజేస్తున్న ప్రభుత్వం గురించి మీరు తెలుసుకోవాలి. జగన్ ఎలా దోచేస్తున్నాడు అనేది ప్రజలు తెలుసుకోవాలి. జగన్ ఒక రంగుల చ్చోడు….ప్రతి దానికీ జగన్ తన పార్టీ రంగులు వేసుకుంటాడు. మౌనంగా ఉంటే మీ మోహాలకు రంగులు వేస్తాడు.’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news