ఎన్టీఆర్ విగ్రహంపై దుండగుల దుశ్చర్యను ఖండించిన చంద్రబాబు

-

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు లో గుర్తుతెలియని దుండగులు మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహంపై దుండగుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మహనీయులను గౌరవించుకునే మంచి సంస్కృతికి వైసిపి మొదటి నుంచి దూరంగానే ఉంటుందని విమర్శించారు.

సంస్థలకు ఉన్న నాయకుల పేర్ల మార్పు, విగ్రహాల తొలగింపు వంటి చర్యలకు ప్రభుత్వమే పాల్పడుతూ ఉండడంతో.. ఆ పార్టీ క్యాడర్ కూడా అదే దారిలో వెళుతుందని ఆక్షేపించారు. ఉప్పలపాడు లో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్రబుద్ధితో వ్యవహరించే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news