వాలంటీర్లపై చంద్రబాబు మొసలి కన్నీరు: పోసాని కృష్ణమురళి

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని మురళీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. వాలంటీర్లు ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వాళ్లపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించమని.. ఇప్పుడు ఇస్తోన్న రూ.5 వేల వేతనం కాకుండా రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీపైన పోసాని స్పందించారు. ‘వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని డ్రామాలు ఆడుతున్నాడు. గతంలో ఇచ్చిన ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మహిళల్ని చులకనగా చూస్తాడు అని ఆరోపించారు . పురందీశ్వరి బీజేపీలో ఉండి టీడీపీ కోసం పని చేస్తున్నారు’ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు జీవితమంతా స్టేల మీదనే బతుకుతున్నారని పోసాని కృష్ణమురళి ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news